త్వరలోఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ సేవలు?..
కబురు న్యూస్,హైదారాబాద్,జూన్ 26 :
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ డిజిటల్లోకి అడుగుపెట్ట బోతోంది.ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి చిల్లర కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు.ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రక్రియను స్పీడప్ చేసింది.ఆర్టీసీ బస్సుల్లోనూ గూగుల్ పే,ఫోన్ పే,డెబిట్,క్రెడిట్,పేటీఎం వంటి స్వైపింగ్ పేమెంట్స్ విధానాలతో టికెట్లను జారీ చేయనున్నారు.సాధారణంగా బస్సు టికెట్ల జారీలో కండక్టర్లకు అటు ప్రయాణికులకు చిల్లర భయం ఉంటుంది.ఈ విషయంలో కండక్టర్లు నానా తిప్పలు పడుతుంటారు.ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్ జారీ చేయడానికి గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కసరత్తు షురూ చేశారు.

Author: Kaburu Daily News
Post Views: 915