May 16, 2025 12:49 pm

Follow us

Top 10 direct selling companies in india

గాలి వానలకు కూలిన బ్రిడ్జి..

గాలి వానలకు కూలిన బ్రిడ్జి….!!

 

కబురు న్యూస్,జయశంకర్ భూపాల పల్లి,జులై 03 :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ వద్ద టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి.దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది.మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు.గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని,పెద్దపల్లి జిల్లా ఆర్ అండ్ బి ఇన్ఛార్జి అధికారి ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు.అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు.2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు.నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం,గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి.

Top 10 direct selling companies in india

Leave a Comment

error: Content is protected !!